మహా పీఠాలూ రెండు… ఒకేచోట ఉన్న ఏకైక క్షేత్రం

భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా.. ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవాలు వచ్చేసి.. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా దేవి. ఇక్కడ శివ-శక్తుల పూజలు ఒకే చోట జరగడం విశిష్టత. ఆలయంలో శివకథలు, దేవతామూర్తులు, కళాఖండాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షి గణపతి – యాత్రికుల దశలను సాక్షిగా కాపాడే గణపతి ఆలయం. భక్తుల దర్శనాన్ని కైలాసంలో శివుడికి చెబుతాడని నమ్మకం. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ క్షేత్రానికి సేవలు అందించారు. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా శ్రీశైలంలో నివాసముండి సేవలందించినట్లు చరిత్ర చెబుతుంది.

ఆలయ విశేషాలు ఏంటంటే..

జ్యోతిర్లింగం, శక్తిపీఠం – రెండు మహా పీఠాలూ ఒకేచోట ఉన్న ఏకైక క్షేత్రం. అఖండ దీపం – నిరంతరం వెలుగుతూ ఉండే పవిత్ర దీపం.

నంది విగ్రహం – ఒకే రాయితో చెక్కబడిన, 20 టన్నుల బరువు గల అపూర్వ శిల్పం.

పాండవుల లింగాలు – పాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ప్రధాన ఆలయం వెనుక భాగంలో దర్శనమిస్తాయి.

పాగాలంకరణ సేవ – మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే ప్రత్యేక సేవ. ఆలయ విమాన శిఖరంపై త్రిశూలానికి పాగా కట్టి, ఆలయ నందుల కొమ్ములకు కడతారు. ఇది చిమ్మ చీకటిలో మాత్రమే జరుగుతుంది.

నిత్య కైంకర్యాలు – స్వామివారికి, అమ్మవారికి, పరివార దేవతలకు ప్రతిరోజూ శాస్త్రోక్త పూజలు జరుగుతాయి.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

LIVE TV

Recent News

Subsidiary Of KPS Digital Media Network.

Saranam TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. 

© 2025 saranamtv. All Rights Reserved by. ❤︎ Design And Developed By STAR STREAM ❤︎

×